News October 24, 2025
మంచిర్యాల: కూతురింటికి వెళ్తూ చనిపోయారు

జన్నారం మొర్రిగూడ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI అనూష ప్రకారం.. ఉట్నూర్ మం. ఘన్పూర్ వాసి అంకన్న(50), నాగపూర్ వాసి మోతీరాం(50) బైక్పై దండేపల్లిలో ఉన్న కూతురింటికి బయలుదేరారు. ఈక్రమంలో <<18081961>>మొర్రిగూడ <<>>వద్ద ఉట్నూర్ వైపు వెళ్తున్న బొలెరో- బైక్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో అంకన్న, మోతీరాం అక్కడికక్కడే చనిపోయారు. జైనూర్కి చెందిన బొలెరో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
Similar News
News October 25, 2025
కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.
News October 25, 2025
జర్నలిస్టులకు స్థలాలిచ్చి ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

AP: పేదలందరికీ ఇళ్లు, స్థలాలివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అర్హులైన వారందరికీ 2, 3 సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో GOM భేటీలో చర్చించామన్నారు. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే SC తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్గా ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని మంత్రి వివరించారు.
News October 25, 2025
నుడా వైస్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

నుడా వైస్ ఛైర్మన్గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.


