News October 24, 2025
బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కర్నూలు శివారు చిన్నటేకూరులో జరిగిన ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు కర్నూలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బస్సు ప్రయాణకుల బంధువులు 08518-277305 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులు విడుదల

TG: రాష్ట్రంలో మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం తెలిపింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున రిలీజ్ చేశారు.
News October 25, 2025
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

TG: గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల(రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్మెంట్ పనులను వీరి పరిధిలోకి తెచ్చింది. అటవీ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
News October 25, 2025
అన్ని రాష్ట్రాలకు ‘హైడ్రా’ అవసరం: పవన్

హైడ్రా లాంటి వ్యవస్థ APతో పాటు అన్ని రాష్ట్రాలకు అవసరమని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలకుల ముందుచూపు, నిబద్ధతగల అధికారుల పనితీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను TG ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఇవాళ మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో పవన్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.


