News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

AP: కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదంపై<<>> రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.
Similar News
News February 21, 2026
ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్లు, 75K కాటన్ బ్లౌజ్లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.
News February 21, 2026
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 349 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF-108, CRPF-106, ITBP-12, SSB-53, CISF-70 ఉద్యోగాలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జులై 19న రాత పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: https://upsconline.nic.in
News February 21, 2026
పోలీసులతో కలిసి పనిచేస్తారా? ఇది మీకోసమే!

TG: హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పోలీసులకు సహకరిస్తారు. యువతలోని నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వారికి పాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. HYD పోలీస్ <


