News October 24, 2025
రాష్ట్రంలో 121 పోస్టులు… అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్లో 121 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 26) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD/MS, M.Ch, DM ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. Asst ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠంగా 50ఏళ్లు, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. *మరిన్ని <<-se_10012>>ఉద్యోగ<<>> నోటిఫికేషన్ల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.
News October 25, 2025
ఏపీ TET-2025 షెడ్యూల్ ఇదే..

ఏపీలో <
News October 25, 2025
నితీశ్ కుమార్ దూరం.. కారణం ఏంటంటే?

భారత యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి గాయమైంది. అడిలైడ్లో రెండో వన్డే ఆడుతున్న సమయంలో ఎడమ తొడ కండరాలకు గాయం కాగా నేటి మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఇవాళ్టి వన్డేకు దూరమయ్యారు. నితీశ్ గాయంపై తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు BCCI వెల్లడించింది. అటు తొలి వన్డేలో చివర్లో సిక్సులతో నితీశ్ విరుచుకుపడ్డారు. బౌలింగ్లో చాలినంత అవకాశం రాలేదు.


