News October 24, 2025
పల్నాడు జిల్లాకు అందివస్తున్న అవకాశాలు

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల అమలుకు కార్యాచరణ ప్రారంభించడంతో పల్నాడు జిల్లాకు అవకాశాలు అందిస్తున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే, చెన్నై కారిడార్ బుల్లెట్ ట్రైన్ పల్నాడు జిల్లా మీదగా అమరావతికి చేరే విధంగా DPRలు సిద్ధమయ్యాయి. నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్, మాదిపాడు వద్ద కృష్ణానదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పల్నాడులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేయనున్నాయి.
Similar News
News October 25, 2025
విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.
News October 25, 2025
నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

40ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పులు, జీవక్రియలు నెమ్మదించి చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 25, 2025
ఘోర ప్రమాదం.. బస్సు నడిపింది ఇతనే!

AP: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ బస్సును పల్నాడు(D) ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపాడు. సాధారణంగా హెవీ లైసెన్స్ కోసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. కానీ 5వ తరగతి వరకే చదువుకున్న లక్ష్మయ్య టెన్త్ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ పొందాడు. 2014లోనూ లారీ నడుపుతూ యాక్సిడెంట్ చేయగా ఆ ఘటనలో క్లీనర్ చనిపోయాడు.


