News October 24, 2025

భారత్ బంద్.. యథావిధిగా స్కూళ్లు

image

భారీ వర్షాలకు ఇవాళ ప.గో., ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకూ భారీ వర్షాలున్న నేపథ్యంలో తమకూ సెలవివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఇవాళ భారత్ బంద్ కూడా కావడంతో స్కూళ్లకు సెలవు ఉంటుందని కొందరు భావించారు. కానీ, బంద్ ప్రభావం లేకపోవడంతో ఏపీ, టీజీలో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. మీ ప్రాంతంలో సెలవుందా? COMMENT.

Similar News

News February 13, 2026

తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

image

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 13, 2026

మున్సిపాలిటీలపై ‘హస్తం’

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252

News February 13, 2026

బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్‌కు తొలి అభ్యర్థన!

image

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్‌కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.