News October 24, 2025

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,010 పలకగా.. గురువారం రూ.6,810కి పడిపోయింది. ఈరోజు మళ్లీ పెరిగి, రూ.6,905కి చేరింది. రైతులు నాణ్యమైన, తేమలేని పత్తి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

Similar News

News October 25, 2025

నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

image

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.

News October 25, 2025

మద్యం దుకాణాల లాటరీ.. 24 షాపులకు 474 దరఖాస్తులు

image

2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామగుండం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 షాపుల కోసం మొత్తం 474 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ CI మంగమ్మ తెలిపారు. ఈ లైసెన్సుల కేటాయింపు లాటరీ పద్ధతిలో OCT 27, సోమవారం ఉదయం 11 గంటలకు PDPL జిల్లా బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకే హాజరుకావాలని CI సూచించారు.

News October 25, 2025

చందుర్తి: ఆర్థిక ఇబ్బందులతో అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్య

image

చందుర్తి మండలం సనుగుల దేవుని తండా అంగన్‌వాడీ కేంద్రం టీచర్ గొట్టె పరిమళ (39) శనివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 23 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న పరిమళ.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త నరేష్, ఇద్దరు కుమారులు ఉన్నారు.