News October 24, 2025
బాధిత కుటుంబాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కర్నూల్ జిల్లా కల్లూరులో బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. బాధిత కుటుంబాలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చాన్నారు. GDL కలెక్టరేట్ 9502271122, హెల్ప్ డెస్క్ 9100901599, 9100901598, కర్నూల్ GGH 9100901604, GDL పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ 8712661828.
Similar News
News October 24, 2025
రబీలో జొన్న సాగు – అనువైన రకాలు

రబీ(యాసంగి)లో తేలికపాటి నీటి తడులకు అవకాశం ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. తేమను నిలుపుకునే లోతైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర చల్కా నేలల్లో జొన్నను సాగు చేయవచ్చు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం. తాండూరు జొన్న-55, తాండూరు జొన్న-1, సి.యస్.వి 29 ఆర్, ఎన్.టి.జె-5, సి.యస్.హెచ్ 39 ఆర్, సి.యస్.హెచ్ 15 ఆర్ వంటి జొన్న రకాలు రబీ సాగుకు అనుకూలం.
News October 24, 2025
98 పోస్టులకు నోటిఫికేషన్

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL) 98 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు NOV 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: neepco.co.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 24, 2025
‘అమ్మపై ఒట్టేసి చెప్పు’.. ధనశ్రీపై చాహల్ సెటైర్లు

మాజీ భార్య ధనశ్రీకి భారత క్రికెటర్ చాహల్ రూ.4.75 కోట్ల భరణం చెల్లించడం తెలిసిందే. దీనిపై చాహల్ తాజా పోస్ట్ వైరలవుతోంది. ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉన్న భార్య భరణం అడగొద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ నిర్ణయంపై వెనక్కి వెళ్లనని అమ్మపై ఒట్టేసి చెప్పు’ అని స్మైలీ ఎమోజీలతో క్యాప్షన్ పెట్టారు. విడాకుల అనంతరం వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.


