News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదంలో ఇంకొల్లు యువతి మృతి

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇంకొల్లులోని పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27) మృతి చెందింది. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధాత్రి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యువతి మరణ వార్త గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
Similar News
News October 25, 2025
HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.
News October 25, 2025
HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.
News October 25, 2025
భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

పాక్ బార్డర్లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్స్పేస్లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


