News October 24, 2025
నవీపేట్ శివారులో మహిళ మృతదేహం

నిజామాబాద్ జిల్లా నవీపేట్ నుంచి నాగేపూర్ వెళ్లే రహదారి మధ్యలో హనుమాన్ టెంపుల్ పక్క గల శివారులో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News October 25, 2025
మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.
News October 25, 2025
మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.
News October 25, 2025
GVMCలో ‘స్థాయి’ని మరిచి అవినీతి?

GVMC స్థాయి సంఘంలో కొందరు సభ్యులు స్థాయిని మరిచి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్థాయిసంఘం సమావేశాల్లో 215 పనులకు ఆమోదం తెలిపగా..పలు అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు అడిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. పనుల్లో పర్సెంటీజీలు ఇస్తే దేనికైనా ఓకే చెప్పేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాటాల్లో తేడా రావడంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగినట్లు నాయకుల్లో చర్చ నడుస్తోంది.


