News October 24, 2025
డెత్ జర్నీ.. ఎప్పుడు ఏం జరిగింది?

☞ రా.10.30కి HYD-BLR బయలుదేరిన బస్సు
☞ బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు
☞ తెల్లవారుజామున 3-3:10 మధ్య కర్నూలు వద్ద బస్సు-బైక్ ఢీ
☞ ఇంధనం లీక్ అయ్యి చెలరేగిన మంటలు
☞ 19 మంది సజీవ దహనం, 21 మంది సురక్షితం
☞ రాష్ట్రపతి ముర్ము, పీఎం మోదీ, తెలుగు సీఎంల దిగ్భ్రాంతి
☞ PMNRF నుంచి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
☞ బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు శంకర్ మృతి
☞ క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స
Similar News
News October 25, 2025
డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి!

AP: గ్రేటర్ తిరుపతికి అడుగులు పడుతున్నాయి. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో కలెక్టర్ విలీన ప్రతిపాదనలను GP కార్యదర్శులకు పంపించారు. కాగా తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు పరిధిలోని 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్లో విలీనం చేయనున్నారు.
News October 25, 2025
నాగుల చవితి రోజున చదవాల్సిన మంత్రాలు

నాగుల చవితి రోజున ‘ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్’ శ్లోకాన్ని జపిస్తే.. భక్తులు ముక్తిని, మోక్షాన్ని, నాగరాజు ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోసేటప్పుడు ‘సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ శ్లోకాన్ని పఠిస్తే.. సర్పాలు సంతృప్తి చెందుతాయని నమ్మకం.
News October 25, 2025
సిరిసిల్ల: అత్యధికంగా ముస్తాబాద్లో..

జిల్లాలోని ముస్తాబాద్లో అత్యధికంగా 19.5, అత్యల్పంగా వేములవాడ రూరల్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంట 13.8, ఎల్లారెడ్డిపేట 13.3, రుద్రంగి 9.5, ఇల్లంతకుంట 5.5, కోనరావుపేట 5.3, సిరిసిల్ల 3.5, చందుర్తి 3.5, వేములవాడ 3.3, గంభీరావుపేట 2.3, తంగళ్ళపల్లి 2, బోయినపల్లిలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


