News October 24, 2025

బొమ్మల కొలువులో సచివాలయం, బిర్లా మందిర్

image

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కొలువుదీరేలా బొమ్మల కొలువు రూపొందించి అందులో తెలంగాణ సచివాలయ భవనం, బిర్లా మందిర్ నమూనాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో నివసించే విజయ్ కుమార్ ఏటా ఇలా వినూత్నంగా కొత్త డిజైన్లతో బొమ్మలతో రూపొందిస్తుంటారు. అత్యంత ఆకర్షణంగా ఉన్న ఈ బొమ్మలను చూడటానికి వచ్చిన ప్రజలు విజయకుమార్ కళను అభినందిస్తున్నారు.

Similar News

News October 25, 2025

TARGET జూబ్లీహిల్స్..!

image

జూబ్లీహిల్స్‌లో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం రాజకీయం మరింత వేడెక్కింది. ఇక్కడ గెలిచిన పార్టీకే తర్వాత TGలో వచ్చే అన్ని ఎలక్షన్లలో హవా ఉంటుందనే చర్చ జోరుగా సాగడంతో కాంగ్రెస్, BRS, BJPకి ఇప్పుడు జూబ్లీహిల్స్ టార్గెట్‌గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున స్టేడ్ బడా లీడర్లంతా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇతర జిల్లాల నుంచి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు సైతం వస్తున్నారు.

News October 25, 2025

HYD: తెలంగాణ‌కు KTRకు ఏం సంబంధం?: MLA

image

తెలంగాణకు KTRకు సంబంధం ఏంటని కాంగ్రెస్ MLA మందుల సామెల్ హాట్ కామెంట్స్ చేశారు. ‘TG ఉద్యమం గురించి KTRకు తెలుసా? మీ పార్టీ దొంగల పాళ్యం. నిన్ను నాయకుడని ప్రజలు ఇంకా గుర్తించట్లేదు. మీరు చేసిన అప్పు రూ.8 లక్షల కోట్లు మీ దగ్గరే ఉన్నాయి. మీ చెల్లిని ఎందుకు బయటకు పంపారో చెప్పు. మీపార్టీ బుడబుక్కల పార్టీ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తే మీ పార్టీలో ఒక్కరు మిగలరు’ అని గాంధీ భవన్‌లో అన్నారు.

News October 25, 2025

రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్‌నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్‌లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.