News October 24, 2025
‘ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి’

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న ప్రాంతాల్లో నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పొలాల్లో నిల్వ నీరు తొలగించే చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
News October 25, 2025
NRPT: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే

నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శనివారం ప్రారంభించారు. స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించిన ఆమె, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


