News October 24, 2025

MDK: కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం

image

HYD-బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో మెదక్‌(M)కు చెందిన తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. మండలంలోని శివాయిపల్లికి చెందిన మంగ వేణు అలియాస్ ఆనంద్ దుబాయ్‌లో ఉంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి తిరిగెళ్లాడు. కుమార్తె మంగ చందన(23)ను బెంగళూరులో విడిచి దుబాయ్ వెళ్లేందుకు తల్లి సంధ్యారాణి(43) బస్సులో వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు.

Similar News

News October 25, 2025

బస్సు ప్రమాదం.. వందల ఫోన్లు పేలడంతో?

image

AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోండగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోగా డోర్లు తెరుచుకోలేదు. అటు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా ఫోన్లతో ఉన్న పార్సిల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. వేడికి ఈ బ్యాటరీలు పేలడం ప్రమాద తీవ్రతను పెంచిందని చెబుతున్నాయి.

News October 25, 2025

మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు!

image

AP: టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది MAR 16 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. NOV 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక QR కోడ్ ఇవ్వనున్నారు. దాన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ రానుంది. అటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం 100డేస్ ప్రణాళికను DEC నుంచి అమలు చేయనున్నారు.

News October 25, 2025

20 వేలకు పైగా కేసులు.. కేవలం 5250 మందే చలానాలు కట్టారు!

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వాహనాలకు ఈ ఏడాది JAN 1 నుంచి OCT 22 వరకు 20,172 చలాన్లు విధించగా కేవలం ఇప్పటి వరకు 5255 మంది మాత్రమే ఫైన్ చెల్లించారు. వాహన చట్టాలు బలంగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది లేమి కలిసి సకాలంలో జరిమానాలకు వసూలు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. NTR జిల్లాలోని ప్రైవేట్ బస్సులపై 624 కేసులు నమోదు కాగా… 288 బస్సులపై వేసిన చలాన్లను ఓనర్లు కట్టారు.