News October 24, 2025
వనపర్తి: మద్యం షాపులకు 757 దరఖాస్తులు

వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలో మొత్తం 757 దరఖాస్తులు వచ్చాయని జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 27న కలెక్టరేట్ సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ ప్రక్రియను చేపడతారని తెలిపారు.
Similar News
News October 25, 2025
ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి: బల్దియా కమిషనర్

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ (కంచెలు) ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధిలోని గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్తో పాటు టౌన్ ప్లానింగ్కు చెందిన అంశాలను పరిశీలించి సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు.
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్లో విషాదం నెలకొంది.
News October 25, 2025
భూపాలపల్లి: 27న మద్యం దుకాణాలకు డ్రా

భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన మద్యం దరఖాస్తులకు ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. రెండు జిల్లాలకు సంబంధించిన 59 మద్యం షాపులకు 1,863 దరఖాస్తులు వచ్చాయని, మల్లంపల్లి షాపునకు 77 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్లో దరఖాస్తుదారులు ఆర్టనైజ్డ్ రెప్రెసెంటివ్స్, రిసిప్ట్, ఎంట్రీ పాస్ ఒరిజినల్ను వెంట తీసుకురావాలన్నారు.


