News October 24, 2025

సీటింగ్ పర్మిషన్ తీసుకొని!

image

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్‌కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్‌గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూ‌డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్‌ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆల్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్‌ జరిగింది.

Similar News

News October 25, 2025

పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

image

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులు వాడతారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, సల్ఫేట్స్‌ లేకుండా చూసుకోవాలంటున్నారు.

News October 25, 2025

ఏపీ రౌండప్

image

* బస్సు ప్రమాదం.. ఏపీకి చెందిన మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం
* డిగ్రీ 3వ విడత ప్రవేశాలు.. ఈ నెల 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 25-27న వెబ్ ఆప్షన్లకు అవకాశం, NOV 1న సీట్ల కేటాయింపు
* ఖరీఫ్ ధాన్యం సేకరణకు రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం హామీ
* అమరావతిలో RBI రీజనల్ ఆఫీసు.. నేలపాడులో 3 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం

News October 25, 2025

అయోధ్య దర్శన వేళల్లో స్వల్ప మార్పులు

image

అయోధ్య బాల రాముడి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై రాత్రి 8.30గం. వరకే దర్శనానికి అనుమతించనున్నారు. శీతాకాలం దృష్ట్యా అరగంట కుదించామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. మంగళహారతిని తెల్లవారుజామున 4గం.కు బదులు 4.30కి, శృంగార హారతిని 6కు బదులుగా 6.30గం.కు, శయన హారతిని రాత్రి 10గం.కు బదులు 9.30కి నిర్వహిస్తారు. దర్శనాలు యథావిధిగా ఉదయం 7 గం.కు మొదలవుతాయి.