News April 9, 2024

కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ్టితో జుడీషియల్ కస్టడీ ముగియనుండడంతో గడువు పొడిగించాలని కోర్టును అధికారులు కోరారు. కవితతో కోర్టులో మాట్లాడేందుకు 2 నిమిషాల సమయమివ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. అప్లికేషన్ ఇవ్వాలని కోర్టు సూచించింది.

Similar News

News February 9, 2026

మున్సి‘పోల్స్‌’కు ముగిసిన ప్రచారం

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై SEC నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష/జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

News February 9, 2026

రియల్ ఎస్టేట్.. టైర్-2 సిటీల్లో పెట్టుబడులతో లాభాలు!

image

టైర్-2 సిటీల్లో రియల్ ఎస్టేట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెట్టుబడిదారులు లాభదాయకంగా చూస్తున్నారు. మెట్రో సిటీల కంటే తక్కువ ధరలు, మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్థిరమైన డిమాండ్&రాబడి, ఎక్కువ భూమి అందుబాటులో ఉండటం, పరిశ్రమల వృద్ధి, కనెక్టివిటీ పెరుగుదల వంటివి కారణాలుగా చెబుతున్నారు. RBI క్లాసిఫికేషన్ ప్రకారం 50,000-99,999 మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్-2గా పరిగణిస్తారు.

News February 9, 2026

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.