News April 9, 2024
HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?
Similar News
News December 28, 2025
HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.
News December 28, 2025
సెట్విన్ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్కి అసద్ అల్టిమేటం!

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!
News December 28, 2025
సెట్విన్ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్కి అసద్ అల్టిమేటం!

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!


