News October 24, 2025
రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ మాధవరెడ్డి

భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రహదారి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కంప్యూటర్ సిబ్బంది కేసు ప్రాపర్టీ గదులను తనిఖీ చేసి భద్రతపై పలు సూచనలు అందించారు. కేసులు వివరాలు, దర్యాప్తు పెండింగ్ కేసులు పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News October 25, 2025
మల్దకల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

జిల్లాలో పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. నిందితుల నుంచి 5.5 తులాల బంగారు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైకులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శీను, మల్దకల్ ఎస్సై నందికర్ పాల్గొన్నారు. డ్యూటీలో తెగువ చూపిన కానిస్టేబుల్స్ అడ్డాకుల నవీన్, రామకృష్ణ, తిప్పారెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.
News October 25, 2025
శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.
News October 25, 2025
ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>


