News October 24, 2025

గుడిసె లేని ఊరే ప్రజాపాలన లక్ష్యం: పరిగి ఎమ్మెల్యే

image

గుడిసె లేని ఊరిని చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ పూజలో ఆయన పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

Similar News

News October 25, 2025

‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

image

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

News October 25, 2025

రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

News October 25, 2025

మల్దకల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

జిల్లాలో పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ​నిందితుల నుంచి 5.5 తులాల బంగారు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైకులు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరి శీను, మల్దకల్ ఎస్సై నందికర్ పాల్గొన్నారు. డ్యూటీలో తెగువ చూపిన కానిస్టేబుల్స్ అడ్డాకుల నవీన్, రామకృష్ణ, తిప్పారెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.