News October 24, 2025
వికారాబాద్: పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించాలి: సీపీఎం

పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ను సీపీఎం ఆధ్వర్యంలో కలిసి పత్తి రైతులకు క్వింటాలుకు రూ.5 వేల బోనస్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. డిమాండ్ను ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ వారికి తెలియజేశారు.
Similar News
News October 25, 2025
‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
News October 25, 2025
రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
News October 25, 2025
మల్దకల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

జిల్లాలో పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. నిందితుల నుంచి 5.5 తులాల బంగారు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైకులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శీను, మల్దకల్ ఎస్సై నందికర్ పాల్గొన్నారు. డ్యూటీలో తెగువ చూపిన కానిస్టేబుల్స్ అడ్డాకుల నవీన్, రామకృష్ణ, తిప్పారెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.


