News October 24, 2025

జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు నూరు శాతం పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఈ-క్రాప్ బుకింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News October 25, 2025

బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్‌–వాట్సాప్‌ నం: 9063423950
సంగీత, కంట్రోల్‌ రూమ్‌: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.