News October 25, 2025

పటాన్‌చెరు: బీరంగూడ శంభుని కుంట చెరువులో మృతదేహం

image

బీరంగూడ శంభుని కుంట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని మంజీరా నగర్ కాలనీ చెందిన తన్నీరు శ్రీను(49) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 25, 2025

పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామివారి దర్శనం

image

నాగుల చవితి సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషుడు స్వామివారికి శయనాసనం, సింహాసనం, నివాస స్థలం వంటి సేవలు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా అవతరించాడని విశ్వాసం.

News October 25, 2025

లింగాలలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు రాత్రి ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బల్మూరులో 18.9, పదరలో 17.9, తెలకపల్లిలో 17.4, తిమ్మాజిపేటలో 16.5, బిజినేపల్లిలో 10.3, అచ్చంపేటలో 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

News October 25, 2025

NGKL: 27న లక్కీడీప్ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

image

జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 27న లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాలులో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.