News October 25, 2025
HEADLINES

* కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
* ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి
* మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం: మోదీ
* దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం AP: CBN
* బంగాళాఖాతంలో ఈనెల 27న ఏర్పడనున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
* భారీగా తగ్గిన వెండి ధరలు
Similar News
News October 25, 2025
డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి!

AP: గ్రేటర్ తిరుపతికి అడుగులు పడుతున్నాయి. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో కలెక్టర్ విలీన ప్రతిపాదనలను GP కార్యదర్శులకు పంపించారు. కాగా తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు పరిధిలోని 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్లో విలీనం చేయనున్నారు.
News October 25, 2025
నాగుల చవితి రోజున చదవాల్సిన మంత్రాలు

నాగుల చవితి రోజున ‘ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్’ శ్లోకాన్ని జపిస్తే.. భక్తులు ముక్తిని, మోక్షాన్ని, నాగరాజు ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోసేటప్పుడు ‘సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ శ్లోకాన్ని పఠిస్తే.. సర్పాలు సంతృప్తి చెందుతాయని నమ్మకం.
News October 25, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలో 3రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, HNK, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి MBNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


