News October 25, 2025

ప్రజాసేవల మెరుగుదలే ప్రధాన లక్ష్యం: జిల్లా పంచాయతీ అధికారి

image

PDPL కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టాక్స్ కలెక్షన్, శుభ్రత, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్, రికార్డుల నవీకరణ, DSR యాప్ వినియోగం, PMAY(G) అమలు వంటి అంశాలపై చర్చించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించమని పంచాయతీ అధికారి హెచ్చరించారు. సమావేశంలో శాఖాధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలి: అడ్లూరి

image

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News October 25, 2025

ఫ్లవర్‌వాజ్‌లో పూలు తాజాగా ఉండాలంటే..

image

ఫ్లవర్ వాజ్‌లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్లవర్‌వాజ్‌ను నేరుగా ఎండ తగిలే ప్లేస్‌లో ఉంచకూడదు.

News October 25, 2025

బిహార్‌లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

image

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.