News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాదంలో 10 మంది నెల్లూరీయులు!

image

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది నెల్లూరీయులు ఉన్నారు. వీరిలో వింజమూరు(M) గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్, భార్య అనూష, చిన్నారులు శశాంక్, మన్విత సజీవ దహనమయ్యారు. దుత్తలూరు(M) కొత్తపేటకు చెందిన మరో కుటుంబం నేలకుర్తి రమేశ్, భార్య శ్రీలక్ష్మి, జశ్వత, అభిరామ్‌తోపాటు నెల్లూరు వేదాయపాళెం వెంకటరెడ్డినగర్‌కి చెందిన శ్రీహర్ష, డైకాస్ రోడ్డుకు చెందిన హారిక ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

Similar News

News October 26, 2025

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌: అజీజ్

image

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.

News October 26, 2025

సకాలంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతులను కల్పించాలని ఆయన సూచించారు.

News October 25, 2025

కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.