News October 25, 2025
జనగామ: చర్చలు సఫలం.. చదువులు పదిలం!

బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాజమాన్యాలతో చర్చించి బోధనకు ఇబ్బందులకు లేకుండా చూడాలని ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు జనగామ జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి చదువులు సాగేలా కృషి చేశారు.
Similar News
News October 25, 2025
జూబ్లీ బైపోల్: BRS అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు

జూబ్లీ బైపోల్ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ను టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి శనివారం కలిశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి విరుద్ధంగా BRS ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. సొంత పత్రికల్లో విపరీతంగా ప్రచారాలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. BRS అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కింద దీనిని పరిగణించాలని ఆర్వీకర్ణన్ను సామ రామ్మోహన్ కోరారు.
News October 25, 2025
బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్లో హెల్ప్లైన్

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్–వాట్సాప్ నం: 9063423950
సంగీత, కంట్రోల్ రూమ్: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.


