News October 25, 2025
అయోధ్య దర్శన వేళల్లో స్వల్ప మార్పులు

అయోధ్య బాల రాముడి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై రాత్రి 8.30గం. వరకే దర్శనానికి అనుమతించనున్నారు. శీతాకాలం దృష్ట్యా అరగంట కుదించామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. మంగళహారతిని తెల్లవారుజామున 4గం.కు బదులు 4.30కి, శృంగార హారతిని 6కు బదులుగా 6.30గం.కు, శయన హారతిని రాత్రి 10గం.కు బదులు 9.30కి నిర్వహిస్తారు. దర్శనాలు యథావిధిగా ఉదయం 7 గం.కు మొదలవుతాయి.
Similar News
News October 25, 2025
విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్టైమ్ ఇదే

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్టైన్మెంట్ మాస్వేవ్ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


