News October 25, 2025
రామగుండం మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల స్వీకరణ

పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజ్ (సిమ్స్) ఇన్చార్జి ప్రిన్సిపల్గా డాక్టర్ జి.నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ హిమబిందు స్థానంలో డాక్టర్ నరేందర్కు ఉన్నత అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ హిమబిందుకు ఈ కళాశాలలోనే ప్రొఫెసర్గా స్థానం ఇచ్చారు. కాగా, బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నరేందర్ను ప్రొఫెసర్, విద్యార్థులు ఘనంగా స్వాగతించారు.
Similar News
News October 25, 2025
పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామివారి దర్శనం

నాగుల చవితి సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషుడు స్వామివారికి శయనాసనం, సింహాసనం, నివాస స్థలం వంటి సేవలు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా అవతరించాడని విశ్వాసం.
News October 25, 2025
లింగాలలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు రాత్రి ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బల్మూరులో 18.9, పదరలో 17.9, తెలకపల్లిలో 17.4, తిమ్మాజిపేటలో 16.5, బిజినేపల్లిలో 10.3, అచ్చంపేటలో 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News October 25, 2025
NGKL: 27న లక్కీడీప్ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 27న లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాలులో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.


