News October 25, 2025
HYD: మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా.. జర జాగ్రత్త..!

ఓ మహిళ మంటల్లో కాలిపోయిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD సరూర్నగర్ PS పరిధి త్యాగరాయనగర్ కాలనీలోని MSR రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో మాధవి(45) నివాసం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత బయటకు వెళ్లిన మాధవి కొద్దిసేపు తర్వాత తిరిగొచ్చి వెలిగించింది. దీంతో మంటలు అంటుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. కేసు నమోదైంది. జర జాగ్రత్త..!
Similar News
News October 25, 2025
జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్స్టర్ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.
News October 25, 2025
GWL: బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష కమిటీ సమావేశం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో గద్వాల పట్టణంలో రేపు అఖిలపక్ష కమిటీ సమావేశం ఉంటుందని కమిటీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో సాయంత్రం 5:00 జరిగే సమావేశానికి బీసీ సంఘాలు, అఖిలపక్ష కమిటీ నేతలు తప్పక హాజరు కావాలన్నారు. బీసీల రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుందన్నారు.
News October 25, 2025
డేటా భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

ఒక దేశం బలం దాని డేటాను నియంత్రించడంలోనే ఉందని సిద్దిపేట పోలీస్ కమిషనర్(సీపీ) విజయ్ కుమార్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘సైబర్ భద్రత, సవాళ్లు మరియు దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. చైనా మినహా అన్ని దేశాల డేటా గూగుల్ వద్ద ఉందని, భారతీయులు ఉచిత డిజిటల్ సేవలకు త్వరగా ఆకర్షితులవుతారని తెలిపారు. డేటా భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


