News October 25, 2025

KTDM: మహిళకు వేధింపులు.. ముగ్గురికి జైలు శిక్ష

image

మహిళను అసభ్య పదజాలంతో దూషించి, వేధింపులకు గురిచేసిన కేసులో నిందితులకు దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి భవాని శుక్రవారం జైలు శిక్ష, జరిమానా విధించారు. పెద్దగొల్లగూడెంకి చెందిన సీతారాములు, రఘురాం, వెంకటేశ్ మహిళను వేధించినట్లు నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్షతో పాటుగా ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధించారు.

Similar News

News October 26, 2025

ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు

image

మొంథా తుఫాన్ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. వసతి గృహాల విద్యార్థులు ఆదివారం సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 25, 2025

స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

image

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.

News October 25, 2025

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకండి: కలెక్టర్

image

తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కోరారు.