News October 25, 2025
విజయవాడ: ఉదయం ఒక ధర.. మధ్యాహ్నం ఇంకో ధర!

నగరంలోని పూల మార్కెట్లో ఇష్టారీతిన, నచ్చిన ధరలకు పూలను విక్రయిస్తున్నారు. గులాబీ పూలు తెల్లవారుజామున KG ధర రూ.160కే అమ్ముతుండగా మధ్యాహ్నం రూ.300 వరకు అమ్ముతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువైతే అమాంతం ధరలు పెంచేస్తున్నారు. కర్ణాటక నుంచి దిగుబడి అవుతుండటంతో ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. వీఎంసీ స్థలంలో వ్యాపారం ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
Similar News
News October 25, 2025
పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.
News October 25, 2025
ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News October 25, 2025
బేకరీపై టాస్క్ఫోర్స్ దాడులు

వరంగల్ ఫోర్టు రోడ్డులోని ఓ బేకరీ షాపుపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గడువు తీరిన, నాణ్యత లేని రూ.11 వేల విలువైన తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం షాపు యజమానిని మున్సిపల్ ఆరోగ్య విభాగానికి అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.


