News October 25, 2025

నిజామాబాద్: ‘పెన్షన్ ఇప్పించండి’

image

NZB జిల్లాలోని 2003 DSC ఉపాధ్యాయులు తమకు పెన్షన్ ఇప్పించాలని MLC శ్రీపాల్ రెడ్డిని కోరారు. PRTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు MLCని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ.. పెన్షన్ ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న నగరం

image

బొల్లారం, బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ పారిశ్రామికవాడలోని ఆయిల్, కెమికల్ కంపెనీల కారణంగా ఈ ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వీటినుంచి విడుదలవుతున్న వాయువులను పీల్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు మౌనం వ్రతం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 26, 2025

చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

image

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్‌లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 26, 2025

బాపట్ల: గమనిక.. రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29వ తారీకు వరకు మొంథా తుఫాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఎవరు సమస్యలకు సంబంధించిన అర్జీలతో జిల్లా కార్యాలయానికి సోమవారం రావద్దని తెలిపారు.