News April 9, 2024
దుత్తలూరు: భారీగా పెరిగిన చికెన్ ధరలు

చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. మొన్నటివరకు 200 నుండి 220 రూపాయల వరకు పెరిగిన చికెన్ ధరలు మంగళవారం నాటికి 310 కి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా చికెన్ దుకాణాల వద్ద వినియోగదారులు రద్దీగా ఉన్నప్పటికీ అధిక మోతాదులో చికెన్ విక్రయాలు జరగడంలేదని వ్యాపారస్థులు తెలిపారు.
Similar News
News October 5, 2025
KHOJ టూల్, సైబర్ నేరాలపై అవగాహన

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా KHOJ టూల్, సైబర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా. అజిత వేజెండ్ల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
News October 5, 2025
వ్యవసాయ విజేతలను ఎంపిక చెయ్యండి : కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఛాంపియన్ ఫార్మర్ ఎంపిక చేసి, వ్యవసాయంలో నూతన విధానాల అమలు ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. యాంత్రీకరణపై జరిగిన వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు.
News October 4, 2025
శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళగానే కోర్కెలు మరిచిపోతాం.. ఎందుకు?

తిరుమల శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళగానే జగన్మోహనకారాన్ని చూస్తూ బాహ్యప్రపంచాన్ని మర్చిపోతారు భక్తులు. ప్రధానాచార్యుల తపోబలం, యోగబలం, సంప్రోక్షణ ముహూర్త బలం వల్ల సకలదేవతలు స్వామిచుట్టూ కొలువై ఉండటమే ఇందుకు కారణమని పండితులు చెబుతున్నారు. దేవతల దివ్యశక్తి నిత్యం ఆలయంలో ప్రవహిస్తూ ఉంటడంతో విమాన ప్రాకారంలోకి ప్రవేశించిన భక్తుల మనసు ఏకాగ్రతం అవుతుంది. బంగారు వాకిలి దాటగానే బాహ్యప్రపంచంలోకి అడుగు పెడతారట.