News October 25, 2025
రేపు అచ్చంపేటకు రాష్ట్ర గవర్నర్ రాక

నల్లమల అడవుల్లో పేదరికం కారణంగా వివాహాలు చేసుకోలేని 111 మంది చెంచు జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ సామూహిక వివాహాలు నిర్వహించనుంది. ఐతోలు ఆలయ అర్చకులు వెల్దండ హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. పేద చెంచులను ఆదుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News October 26, 2025
ఈ గుణం ఉంటేనే భగవంతుని ప్రేమ దక్కుతుంది

భగవద్భక్తిలో సంపూర్ణ విశ్వాసం పొందాలంటే మానవుడు సత్వ గుణాన్ని పెంచుకొని, రజో-తమో గుణాలను తగ్గించుకోవాలని వేమన పద్యాల్లో పేర్కొన్నారు. ‘త్రిగుణాల ప్రభావం దేవుళ్లపై స్పష్టంగా ఉంటుంది. సత్వగుణం కలవారు దేవున్ని నమ్ముతారు. రజోగుణం కలవారు ‘దేవుడు ఉన్నాడా, లేడా’ అనే సందేహంతో ఊగిసలాడతారు. తమోగుణం కలవారికి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఇతర వేళల్లో దేవుడు లేడని వాదిస్తారు’ అని రాశారు. <<-se>>#WhoIsGod<<>>
News October 26, 2025
వాయుగుండం.. భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా, రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని తెలిపింది.
News October 26, 2025
SDPT: తగ్గిన మద్యం కిక్కు.. ఎవరికి దక్కేనో లక్కు ?

సిద్దిపేట జిల్లాలో ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. గతంతోపోలిస్తే సగం దరఖాస్తుల తగ్గాయి. ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఉన్న గడుపును 23 వరకు పొడిగించినా 93 వైన్ షాపులకు 2,782 దరఖాస్తులే వచ్చాయి. 2023లో 4,166 రాగా ఈసారి 1,384 దరఖాస్తులు తగ్గాయి. టెండర్ దరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెరగడంతో వేయడానికి వెనకాడారు. కాగా 27న డ్రా తీయనుండగా లక్కు కోసం ఎదురుచూస్తున్నారు.


