News October 25, 2025
NRPT: ధన ధాన్య పథకం రైతులకు వరం: దత్తాత్రేయ

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధినే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. దేశంలోని 100 వెనుకబడిన జిల్లాల్లో “ధన ధాన్య” కార్యక్రమం ప్రారంభించామని, అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మూడు జిల్లాలు ఎంపికయ్యాయని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News October 28, 2025
పాత భవనాల నుంచి వెంటనే తరలించండి: కలెక్టర్

తుఫాను పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి ఆమె సమీక్షించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాలలో నివసించే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.
News October 28, 2025
ఖిలా వరంగల్ తూర్పు కోటలో దారుణం

ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ దారుణానికి దారితీసింది. ఈ ఘటనలో సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సాయి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.


