News October 25, 2025

ప్లానిటోరియం, గార్డెన్‌ పనుల పరిశీలించిన GWMC కమిషనర్

image

బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో చేపడుతున్న ప్లానిటోరియం, కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్ (కేఎంజీ) పనులను కమిషనర్‌ / కుడా వైస్‌ ఛైర్మన్‌ చాహత్ బాజ్‌పాయ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ అజిత్‌ రెడ్డి, ఈఈలు రవి కుమార్‌, భీమ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

పాత భవనాల నుంచి వెంటనే తరలించండి: కలెక్టర్

image

తుఫాను పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి ఆమె సమీక్షించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాలలో నివసించే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

image

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్‌ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.

News October 28, 2025

ఖిలా వరంగల్ తూర్పు కోటలో దారుణం

image

ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ దారుణానికి దారితీసింది. ఈ ఘటనలో సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సాయి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.