News October 25, 2025

ములుగు: బడి తప్పియ్యని పంతులుకు పురస్కారం..!

image

ఉపాధ్యాయుల హాజరు శాతం నమోదు కోసం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో జంగాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాసమల్ల కృష్ణమూర్తి అత్యధిక హాజరు శాతాన్ని నమోదు చేశారు. ఈ విధానం అమలులోకి వచ్చిన 38 రోజుల్లో 36 రోజులు ఆయన పాఠశాలకు వచ్చారు. ఇలా రాష్ట్రంలో ముగ్గురు మాత్రమే ఉండగా.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కృష్ణమూర్తిని ఉన్నతాధికారులు సత్కరించారు. డీఈవో సిద్దార్థ్ రెడ్డి అభినందించారు.

Similar News

News October 28, 2025

చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News October 28, 2025

హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

image

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్​ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.

News October 28, 2025

తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.