News October 25, 2025

తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక పాఠ్యాంశాలు

image

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక అంశాలకు పెద్దపీట వేశామని తెలుగుశాఖ అధ్యక్షుడు డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. కళాశాల స్వయంప్రతిపత్తి హోదా సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు చేశామన్నారు. పాఠ్యప్రణాళికలో స్వయంప్రతిపత్తి నిబంధనలను అనుసరించి, స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ సముచిత మార్పులు చేశామని,ఈ మార్పు తొలిసారిగా జరుగుతోందని పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

image

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.

News October 28, 2025

చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు రీ నోటిఫికేషన్

image

చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు తక్కువ అప్లికేషన్స్ రావడంతో డ్రాను వాయిదా వేసిన ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1వ తేదీలోగా అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీగా పేర్కొంది. 3న డ్రా నిర్వహిస్తారు. ఈ షాపులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా చల్వాయి షాపునకు 2, గోవిందరావుపేటకు 3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు రీ నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న భంగపడ్డ వారికి ఇదో మంచి అవకాశం.

News October 28, 2025

కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్‌లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.