News October 25, 2025
జూబ్లీ బైపోల్: BRS అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు

జూబ్లీ బైపోల్ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ను టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి శనివారం కలిశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి విరుద్ధంగా BRS ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. సొంత పత్రికల్లో విపరీతంగా ప్రచారాలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. BRS అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కింద దీనిని పరిగణించాలని ఆర్వీకర్ణన్ను సామ రామ్మోహన్ కోరారు.
Similar News
News October 28, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. రేపే లాస్ట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. SHARE IT.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.


