News October 25, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
> స్టేషన్ ఘనపూర్: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
> రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి: రంగారెడ్డి
> ఎస్ఐఆర్ను పొరపాట్లు లేకుండా చేయాలి: సుదర్శన్ రెడ్డి
> జనగామ కలెక్టరేట్లో ఒప్పంద అధ్యాపకుల నిరసన
> జనగామ: భార్యాభర్తలిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష
> జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు
> జనగామలో పత్తి రైతుల రాష్ట్ర సదస్సు
Similar News
News October 28, 2025
HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT
News October 28, 2025
నిర్మల్: రేపటి నుంచి సోయా కొనుగోలు ప్రారంభం

నిర్మల్ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం (రేపటి) నుంచి సోయా కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతుల పంటను త్వరగా కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు రైతులు సహకరించాలని కోరారు.
News October 28, 2025
‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్డేట్లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.


