News October 26, 2025
పల్నాడులో చికెన్ ధరలివే

పల్నాడులో ఆదివారం చికెన్ ధర గత వారంతో పోలిస్తే నిలకడగా కొనసాగుతుంది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ చికెన్ రేట్లు తగ్గలేదని వినియోగదారులు చెబుతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.126 పలుకుతోంది. స్కిన్తో కేజీ రూ.220 నుంచి రూ. 240, స్కిన్లెస్ రూ.230 నుంచి రూ.260కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.900గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.570కి అమ్ముతున్నారు. మరి ప్రాంతాల్లో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి?
Similar News
News October 28, 2025
అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.
News October 28, 2025
వరంగల్ మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

కాకతీయుల వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక వరంగల్ మెట్ల బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. స్థానిక ప్రజల సమక్షంలో ఆమె బావిని ప్రారంభించి నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కాకతీయుల శిల్పకళను కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. సొరంగ మార్గం ద్వారా రుద్రమదేవి ఈ బావికి వచ్చేదని ప్రతీతి అని గుర్తు చేశారు.
News October 28, 2025
గోదావరిఖని: RTC స్పెషల్ యాత్ర క్యాలెండర్

గోదావరిఖని RTC డిపో ఆధ్వర్యంలో NOV యాత్ర క్యాలెండర్ను ప్రకటించినట్లు DM నాగభూషణం ఓ ప్రకటనలో తెలిపారు. NOV 4న- యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, 6న- శ్రీశైలం, 11న- పళని, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, జోగులాంబ, 18న- శ్రీశైలం, 23న- రాంటెక్, ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, మైహర్, చాందా మహంకాళి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


