News October 26, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. కిలో మటన్ రూ.800 కాగా, కిలో చికెన్ రూ.250గా ఉంది. లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు.
Similar News
News October 28, 2025
కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

వాట్సాప్ కాల్స్కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.
News October 28, 2025
కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్ను పప్పెట్గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.
News October 28, 2025
ములుగు: మావోయిస్టు సీసీ కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఎన్నికైనట్లు నేడు డీజీపీ ఎదుట లొంగిపోయిన సీసీ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు@చంద్రన్న తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా సీసీ కమిటీ కార్యదర్శి ఎవరనే విషయానికి తెరపడింది. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు చంద్రన్నతో పాటు బండి ప్రకాశ్ లొంగిపోయిన విషయం తెలిసిందే.


