News October 26, 2025

జానపదుల గాథల్లో కురుమూర్తి స్వామి

image

కురుమూర్తి ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నేటి మక్తల్‌గా పిలవబడుతున్న మగతలనాడుని పాలిస్తున్న ముక్కెర గోపాల్ రెడ్డి కాలంలో వెలుగు చూసింది. అప్పటికి ఇంకా సంస్థానం ఏర్పడలేదు. అయినప్పటికీ స్థానిక పసుల కాపర్లు, గొర్రెల కాపర్లు గుట్ట మీద గుహలో కురుమతి రాయుడిని పూజిస్తున్నట్టుగా జానపద ఆధ్యాత్మిక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి రాజుల కాలానికి ముందే జానపదుల గాథలు ప్రచారంలో ఉన్నాయనేది స్పష్టమవుతుంది.

Similar News

News October 26, 2025

దిలావర్‌పూర్‌లో అత్యధికం

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా దిలావర్‌పూర్ మండలంలో 62.2 మి.మీ., సారంగాపూర్‌లో 51.2 మి.మీ. వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 26, 2025

కొమురం భీమ్‌ గురించి తెలుసుకోండి: మోదీ

image

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.

News October 26, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్!

image

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్‌గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.