News October 26, 2025
జన్నారం: భార్యను కత్తెరతో పొడిచిన భర్త

జన్నారం మం. చింతగూడలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేశాడు. బంధువుల ప్రకారం.. జగిత్యాల జి. స్తంభంపెల్లి వాసి అశోక్ చింతగూడ వాసి అనితను 2020లో పెళ్లి చేసుకున్నాడు. గొడవల కారణంగా దుబాయ్ వెళ్లిన అశోక్ గురువారం తిరిగి వచ్చాడు. శనివారం ఆమె పుట్టింటికి వెళ్లి కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బంధువులు MNCL ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు లేకపోయినా కేసు నమోదు చేసేందుకు వెళ్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News October 28, 2025
గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. ఐదుగురికి అస్వస్థత

గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డార్మిటరీలో పరుపులు తగలబడి పొగ వ్యాపించింది. మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని అంతా బయటకి వచ్చారు. ఈ ఘటనలో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స అందడంతో ఆరోగ్యం మెరుగుపడిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
ఉప్పునుంతలలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అచ్చంపేటలో 25.8, లింగాల 20.3, అమ్రాబాద్ 16.5, తెలకపల్లి 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు: DEO

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO వరలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.


