News October 26, 2025
కరీంనగర్: విద్యాసాగర్కి డాక్టరేట్..!

శాతవాహన విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి కె.విద్యాసాగర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాగర్ పరిశోధన గ్రంథం ప్యాటర్న్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్డిచర్ ఆన్ ఎడ్యుకేషన్: ఏ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేశారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి డా.కోడూరి శ్రీవాణి పర్యవేక్షణలో డాక్టరేట్ అందజేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
Similar News
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News October 26, 2025
పత్తిని ఇక్కడ అమ్ముకుంటేనే లాభం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,68,778 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని.. జిల్లావ్యాప్తంగా 57,23,951 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఆయన తెలిపారు.
News October 26, 2025
NLG: పాపం పత్తి రైతు.. ఇలాగైతే కష్టమే!

వరుస వర్షాలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. అకాల వర్షాల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 12 శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర వచ్చే నిబంధనలు ఉండడం రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం తగ్గడం లేదని రైతుల వాపోతున్నారు.


