News October 26, 2025

SEC రైల్వేస్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు 46% పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే ప్లాట్‌ఫామ్ బిల్డింగ్ కంప్లీట్ అయిందని.. సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. కేంద్రం అమృత్ భారత్ స్కీమ్ కింద రూ.714.73 కోట్లతో ఈ పనులు చేపడుతోందని వివరించారు.

Similar News

News October 28, 2025

సకల శుభాలను ప్రసాదించే ఆదిపరాశక్తి శ్లోకం

image

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
ఈ శ్లోకం సాక్షాత్తు ఆది పరాశక్తిని స్తుతిస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తే అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారు మనల్ని అన్ని విధాలా కాపాడుందని అంటున్నారు. చెడు ఆలోచనలు రాకుండా చేసి, భయాలను దూరం చేసి, శాంతి, అదృష్టం, క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని పేర్కొంటున్నారు. <<-se>>#Shloka<<>>

News October 28, 2025

ట్రంప్‌కు MRI టెస్ట్… ఆరోగ్యంపై సందేహాలు

image

ఇటీవల తనకు MRI స్కానింగ్ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. జ్ఞాపకశక్తి పరీక్ష చేయించుకున్నట్లు చెబుతూ అంతా బాగానే ఉందన్నారు. దీనిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన నాడీ, హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారేమోనని GW వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ రైనర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ట్రంప్ చేతులపై మచ్చలు, నడకలో మార్పు, జ్ఞాపకశక్తి లోపంతో తడబాటు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

News October 28, 2025

రేపు, ఎల్లుండి పలు ఆర్జిత సేవలు రద్దు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 8-9 గంటల వరకు పుష్పయాగానికి అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎల్లుండి తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉండవని పేర్కొంది.