News October 26, 2025
బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.
Similar News
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా
News October 26, 2025
నారద భక్తి సూత్రాలు – 8

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>
News October 26, 2025
విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.


