News October 26, 2025

చిత్తూరు జిల్లా స్పెషల్ అధికారిగా గిరీష నియామకం

image

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా పీఎస్ గిరీషను నియమించింది. వర్షాల ప్రభావం తగ్గే వరకు ఆయన విధుల్లో ఉండనున్నారు. జిల్లాకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News October 26, 2025

ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన చిత్తూరు SP

image

జిల్లా AR కార్యాలయంలో పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శనను SP తుషార్ డూడీ ఆదివారం ప్రారంభించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు స్వయంగా ఆయుధాలు గురించి వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఏటా రెండు రోజులపాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు.

News October 26, 2025

నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

image

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.

News October 26, 2025

చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

image

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.