News October 26, 2025
వాజేడు: వాగులో పడి బాలుడి మృతి

వాగులో పడి బాలుడి మృతి చెందిన ఘటన వాజేడు మండలంలో జరిగింది. పేరూరుకు చెందిన బొల్లె జశ్వంత్ (13) స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం పేరూరు భోగిరాల మడుగువాగులో స్నానం కోసం ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు జశ్వంత్ గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణ ప్రసాద్ గజ ఈతగాళ్ల సహాయంతో ఆదివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News October 26, 2025
మొంథా తుఫాను.. ప్రజలకు జగన్ సూచనలు

AP: మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని YCP అధినేత జగన్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలను NOV 4కు వాయిదా వేసినట్లు వైసీపీ వెల్లడించింది.
News October 26, 2025
TU: B.Ed, B.P.Ed రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని B.Ed, B.P.Ed 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్(2021 బ్యాచ్) విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నవంబర్ 3వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 26, 2025
వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.


